మహేష్ బాబు తన 28వ సినిమాను తెలుగు స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కాగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇందులో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.
ఇందులో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరంటే మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈయన ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కథ నచ్చడంతో పృథ్వీరాజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మన తెలుగు వాళ్లకు బాగా తెలిసిన హీరో అయితే ప్లస్ అవుతుంది.. పృథ్విరాజ్ ఉన్నా మళయాళ మార్కెట్ మహేష్కు లేదు. అదే ఏ ఉపేంద్రనో లేదా బాగా తెలిసిన పాపులర్ ఉంటే ప్లస్ అయ్యేదని.. త్రివిక్రమ్ బుద్ధి ఇలా ఆలోచిస్తోందేంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.