సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి టాలెంట్ కూడా బయట పెట్టడానికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. మరొకపక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని ఎంతోమంది డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు. వీటి ద్వారా సినీ సెలబ్రిటీలు గా మారి పలు సినిమాలలో అవకాశాలు కూడా సంపాదించుకుంటూ ఉన్నారు కొంతమంది ప్రేక్షకులు. అలాంటి వారిలో టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక దుర్గారావు టాలెంట్ తో సరికొత్త డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని నవ్వించి బాగా ఫేమస్ అయ్యారని చెప్పవచ్చు.
ముఖ్యంగా నాది నక్కలీసి గొలుసు అనే సాంగ్ ద్వారా ఈ ఇద్దరు దంపతులు బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్లలో బాగా అలరించారు. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను సైతం నవ్వించడమే కాకుండా యూట్యూబ్లో కూడా బాగా ట్రెండింగ్ వీడియోలను చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీ హోదాను అందుకున్నారు దుర్గారావు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉంది. ఇక జబర్దస్త్ తో పాటు జీ తెలుగు, స్టార్ మా లో ప్రోగ్రాములు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు.
ఇక ఈవెంట్లకు కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఒకప్పుడు బట్టలు కొనుక్కోవడానికి కూడా దుర్గారావు దగ్గర కనీసం ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. దుర్గారావు కొన్ని బ్రాండ్స్ ప్రమోషన్స్ తో పాటు యూట్యూబ్ నుంచి కూడా ప్రతి నెల రూ 60 వెలు వస్తుందని సమాచారం. దీంతో తమ పిల్లల్ని కూడా చదివిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టిక్ టాక్ దుర్గారావు గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.