వివాహ సమయంలో జూ.ఎన్టీఆర్ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విదేశాలలో సైతం అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన కుటుంబానికి కూడా అండగా నిలుస్తున్నారు. ఇక వీరి తండ్రి హరికృష్ణ మరణించిన తర్వాత తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి పలు సినిమా విషయాలు, వ్యక్తిగత విషయాలు చర్చించుకుంటూ అన్నదమ్ములిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు..

Junior NTR And Lakshmi Pranathi's 100 Crore Wedding: When The Star Wife  Wore A Saree Worth
వివాదాలకు దూరంగా ఉండే ఎన్టీఆర్ కొన్ని కారణాల చేత రాజకీయ నాయకుల నుంచి విమర్శలకు కూడా గురవుతున్నారు. కానీ ఎన్టీఆర్ మంచితనాన్ని గుర్తించలేక కొంతమంది కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అభిమానులు సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతేకాదు కొన్ని ప్రముఖ చానల్స్ వారు ఎన్టీఆర్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని వెంటనే ఆ ఛానెల్స్ ను బ్యాన్ చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక ఇలా మొత్తానికైతే ఎన్టీఆర్ బాగా పాపులర్ అవుతున్నారని చెప్పవచ్చు ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక ఆయన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న సమయంలో ఎంత కట్నం తీసుకున్నారు అనే విషయం వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

2011 మే 6వ తేదీన అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి . ఇక వీరి పెళ్లికి చంద్రబాబు నాయుడు సహాయం చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో అత్యంత ఖరీదైన ల్యాండ్ బ్యాంకు ఉన్న నార్నే వారి ఇంటి కూతురునే ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం వల్ల అప్పట్లోనే దాదాపు రూ.250 కోట్ల రూపాయల కట్నం దక్కించుకున్నట్లు సమాచారం. ఇక అంతే కాదు నార్నే ఫ్యామిలీ వారు లక్ష్మీ ప్రణతికి ఇచ్చిన కట్నం విలువ సుమారుగా రూ.1200 కోట్లు. ఎంతో అన్యోన్యంగా సాగే ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు దాదాపుగా మీడియాకు దూరంగా ఉండే లక్ష్మీ ప్రణతి.. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ తన బాధ్యతలను నెరవేరుస్తోంది.