జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు యువతకి పరిచయం చేయనవసరం లేదు. ఇపుడు టాలీవుడ్లో వున్న ప్రముఖ టీవీ యాంకర్లలో ఈమె ఒకరు. అందంతోపాటు, చలాకీతనం అనసూయకి అలంకారం. అందుకే కుర్రాళ్ళు ఈమె టీవిలో కనబడిందంటే చాలు, తేరిపారా చూస్తూ ఉండిపోతారు. దాంతో ఈ బొద్దుగుమ్మకి పరిశ్రమలో మంచి డిమాండ్ వున్నది. ఓ వైపు టీవీ ప్రోగ్రామ్స్ మరోవైపు సినిమాలలో నటిస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతోందంటే అతిశయోక్తిగా ఉంటుంది కానీ ఇది నిజం. కాగా ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్ళనుండి జబర్దస్త్ షోకి దూరంగా ఉంటోంది.
అయితే ఈమె స్థానాన్ని యాంకర్ రష్మీ భర్తీ చేస్తోంది. అయినా కూడా ఆ వైదికపై అనసూయ ఎప్పుడు కనబడుతుందా అని ఎదురుచూసే మహానుభావులు ఎందరో వున్నారు. ఇకపోతే అనసూయ ఇప్పుడు ఫారిన్ లొకేషన్స్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడి అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అప్డేట్స్ ఇస్తోంది. దాంతో అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాల్లో మార్క్ చూపిస్తోంది.
ఈ క్రమంలో అనసూయ తాజాగా తన స్నేహితులతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. కాగా ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు. ప్రకృతి ఒడిలో అనసూయ కొత్త ఫోటోలను చూసి కుర్రాళ్ళు మనసు పారేసుకుంటున్నారు. మోడ్రన్ దుస్తుల్లో అమ్మడు కవ్విస్తోంది. ఇకపోతే ప్రస్తుతం యాంకర్ అనసూయ ఫారిన్ ట్రిప్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. డే టు డే తన ట్రిప్ విశేషాలకు సోషల్ మీడియా ఫోలవర్స్తో షేర్ చేసుకుంటోంది.