తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం ,సిసింద్రీ , ఆ నలుగురు తదితర సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు పొందింది. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ డైరెక్టర్లు అయిన కే విశ్వనాథ్, బాపు వంటి వారి దగ్గర మంచి అభిప్రాయాన్ని సంపాదించుకుంది. అయితే ఆమనికి వివాహమైన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. గడచిన కొంతకాలం నుంచి ఈమె తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలోను నటిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉన్నది.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆమని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తన కెరియర్ లోని తనకు ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్లు వచ్చాయని.. అలాంటి వాటిలో నటిస్తూ వచ్చానని కానీ తనకి పూర్తిగా నటిగా పెద్దగా సంతృప్తి చెందలేదని తెలియజేస్తోంది. తన సంతృప్తి పడేటువంటి పాత్రల కోసం ఇంకా ఎదురుచూస్తున్నానని.. తెలియజేసింది ఆమని. తన చివరి కోరిక ఏదైనా ఉంది అంటే అది కేవలం డైరెక్టర్ రాజమౌళి సినిమాలో ఒక క్యారెక్టర్ అయినా చేయాలి అని తెలియజేసింది. రాజమౌళి డైరెక్షన్లో ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధమే అని తెలియజేసింది ఆమని.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల సైతం రియంట్రీ ఇచ్చి పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో అలాంటి వారిలో మీన విజయశాంతి ,రమ్యకృష్ణ తదితర హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు. వీరందరూ పలు సినిమాలలో తల్లిగా లేదా అక్కగా ఇతర పాత్రలో సైతం నటిస్తూ మెప్పిస్తూ ఉన్నారు. అయితే తన చివరి కోరిక మాత్రం మరి ఎప్పటికీ నెరవేర్చుకుంటుందో చూడాలి అని అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు.