సినీ ఇండస్ట్రీలో విషాదం.. కృష్ణ భార్య మృతి..!!

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు తల్లి మరణించడం జరిగింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల చికిత్స నిమిత్తం ఏ ఐ జి హాస్పిటల్ కి చేరిన ఇందిరాదేవి నిన్న రాత్రి స్వర్గస్తులయ్యారు. ఇక కృష్ణ ,ఇందిరా దేవికి ఐదుగురు సంతానం ఇందులో రమేష్ బాబు, మహేష్ బాబు, కూతుర్లు పద్మావతి, మంజుల, ప్రియదర్శని ఉన్నారు.

Mahesh Babu Mother Passes Away : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు  తల్లి ఇందిరా దేవి కన్నుమూత.. | Super Star Mahesh babu Mother And Super Star  Krishna Wife Indira Devi Passed Away– News18 Telugu

ఇక గత కొన్ని నెలల క్రితమే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఇక ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేష్ బాబు కుటుంబం తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. ఇక ఈమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఈమె మరణించడానికి ఒక నెలరోజుల ముందు ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు మరణించగా ఇప్పుడు కృష్ణ భార్య ఇందిరా దేవి కూడా మరణించడంతో ఆయన అభిమానులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Superstar Krishna's Family Celebrates Their Anniversary Along With Sudheer  Babu's Son Charith's Birthday
ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరి మరణం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం తల్లివియోగంతో శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అంతేకాదు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఆమె పార్తివదేహం సందర్శనార్థం చాలామంది అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచుతారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.