టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోయిన్లు ఉన్నారు. అయితే ఈ ఏడాది కొన్ని కారణాల చేత కొంతమంది హీరోయిన్లు సైతం గ్యాప్ తీసుకోవడం జరిగింది. కొంతమందికి సమయం దొరకగా మరి కొంతమందికి కొన్ని కారణాల చేత సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారి గురించి గ్రీన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హీరోయిన్ శృతిహాసన్ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే సమయంలో క్రాక్ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది. అటు తరువాత ఈమె వరుసగా ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. తెలుగులో చివరిగా ఈమె పవన్ కళ్యాణ్ కు జోడిగా వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఇక ఈ ఏడాది మాత్రం ఈమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం సలార్, వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఇక ఏడాది కూడా ఈమె సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.
మరొక హీరోయిన్ బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న అనుష్క శెట్టి . అయితే ఆ తర్వాత చివరిసారిగా 2020 లో నిశ్శబ్దం సినిమాలో నటించింది. అయితే ఇక అప్పటినుంచి ఈమె సినిమాలో నటించలేదు. అయితే కేవలం మంచి కథలు దొరకకపోవడం వల్ల మరొకవైపు బరువు ఎక్కువగా పెరగడం వల్లే ఈమె సినిమాలకు దూరమైందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది కూడా అనుష్క శెట్టి సినిమా విడుదలయ్యే అవకాశం లేదు.
ఇక మరొక హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహమైన తర్వాత కొన్ని సినిమాలు అంగీకరించింది. అయితే అవన్నీ చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె గర్భవతి కావడంతో సినిమాల నుంచి తప్పుకుంది . ఈమె నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల చేత అవి విడుదల కాలేదు. ఇక ఏడాది కూడా కాజల్ అగర్వాల్ సినిమా సందడి లేనట్టే అని చెప్పవచ్చు.
ఇక వీరే కాకుండా తెలుగులో ఒక సినిమా కూడా ఈ ఏడాది విడుదల చేయని వారిలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈమె చివరిగా కొండ పొలం సినిమాలో నటించింది. ఇక ఈమెతోపాటు నబా నటేష్, అతిథి రావు హైదరి , కియారా అద్వానీ కూడా ఉన్నారు.