నాటి రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వ్యసనాలకు బానిస అయ్యేవారు.. ఆ వ్యసనాలు బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఎస్వీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు .. వారు మత్తులో ఎప్పుడూ ఉండేవారు. అయితే ఈ నటుడు తాగకపోతే తోటి నటీనటులను సైతం తన మాటలతో ఇబ్బంది పెట్టేవారట.. ఒకవేళ తాగితే మాత్రం దర్శకులకు, నిర్మాతలకు షూటింగ్ రాకుండా ఏడిపించే వారట. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత భోజన సమయంలో భోజనం చేయాలి అంటే అందరూ ఒకే చోట కూర్చొని తినేవారు.అలా ఇంటి నుండి ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద క్యారేజీలు కూడా వచ్చేవట. అయితే ఎస్వీఆర్ కు మాత్రం క్యారేజ్ తో పాటు ఒక పెద్ద బాటిల్ కూడా వచ్చేదన్నట్లుగా తెలుస్తోంది. ఆయన గ్యాప్ దొరికిందంటే చాలు ఎక్కువగా మందు పుచ్చుకోవడానికి తన సమయాన్ని కేటాయించే వారట. అలా భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న ఏవైనా చెట్ల చాటుకు వెళ్లి మందు తాగాలనుకునే వారట. గుండమ్మ కథ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్లో జమున అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్నదట.
ఎస్వీఆర్ గురించి ఆ మాట ఈ మాట చెబుతూ ఉండేవారట ఆమెకు అయితే ఆ మాటలన్నీ విన్న జమున కాస్త భయపడి నిజంగా అతడు తాగుతాడా లేదా అని అడగాలనుకున్నరట. అయితే ఎస్వీఆర్ తాగుతున్నప్పుడు మాత్రం ఎవరు కూడా ఆయన వైపు వెళ్లడానికి ఇష్టపడడు. ఒకవేళ మనసు బాగా ఉంటే ఆప్యాయంగా చూస్తాడు లేకపోతే కోపాన్ని ప్రదర్శించే వారట. ఎస్వీఆర్ మద్యం సేవిస్తున్నప్పుడు..అలా జమున మాత్రం ఆయనని అలాగే చూస్తూ ఉండిపోయిందట అది గమనించిన ఎస్వీఆర్.. ఓ పిల్ల వేస్తావా అంటూ అడిగారట దానికి జమున అబ్బే లేదండి అన్నగారు అన్నదట . అయితే ఎస్వీఆర్ మాత్రం అన్న కాదు నన్ను మామ లేదా బావ అని పిలవాలని అంటూ జారీ చేశారు. దాంతో అప్పటి నుంచి ఎస్వీఆర్ ను చనువుగా మామగారు అని పిలుస్తూ ఉంటానని జమున తెలిపింది. అలా తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపింది జమున.