చిత్ర పరిశ్రమంలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్గా సక్సెస్ అవుతారు. మరి కొంతమంది మధ్యలోనే చిత్ర పరిశ్రమ నుండి దూరంగా వెళ్లిపోతారు. ఈ సందర్భంలోనే కొంతమంది హీరోయిన్లు తాము నటించిన మొదటి సినిమా తర్వాత మరో సినిమా అవకాశం రాక చిత్ర పరిశ్రమ నుంచి వెను తిరిగి వెళ్లిపోయిన వారుఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన సినిమా విడుదల అంటేనే తెలుగు పరిశ్రమలో వారి అభిమానులకు ఒక పండుగలాగా ఉంటుంది. ఈ సందర్భంలోనే ఆయనతో కలిసి నటించిన హీరోయిన్ల కొందరికి ఆ సినిమాతో క్లోజ్ అయిపోయిందట. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సుప్రియ:
అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా నాగార్జున మేనకోడలుగా ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితురాలే. ఈమె అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక ఇది పవన్ కళ్యాణ్ కు మొదటి సినిమా కావటం విశేషం. ఈ సినిమా వీరిద్దరికీ అనుకున్నంత పేరు తీసుకు రాలేకపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ గా మారాడు. కానీ సుప్రియ ఈ సినిమా తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
అదితి:
పవన్ కళ్యాణ్ సినిమాలోని సూపర్ హిట్ సినిమా తమ్ముడు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కెరియర్ మరో లెవల్ కి వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో లవ్లీ క్యారెక్టర్ లో కనబడి అతిథి బాగా ఫేమస్ అయింది. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా తర్వాత ఆమెకి సినిమా అవకాశాలు రాలేదు. ఈ సినిమాతో ఆమె కెరియర్ ముగిసింది అని చెప్పవచ్చు.
రేణూ దేశాయ్:
పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలలో బద్రి కూడా ఒకటి ఈ సినిమాల పవన్ కళ్యాణ్ నటనకు అనేే యాటిట్యూడ్ సినిమాకి హైలెట్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన రేణు దేశాయ్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగలేక పోయింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు తర్వాత వీరిద్దరూ కలిసి జానీ సినిమాలో నటించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్యారియర్ లోనే అత్యంత చేత సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత రేణుదేశయ్ మరో సినిమాలో నటించలేకపోయింది. అవకాశాలు లేక తన సినిమా కెరియర్ ఆ సినిమాతో క్లోజ్ అయిపోయింది.
సారా జెన్ డియాస్:
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన స్టైలిష్ సినిమా పంజా. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది సారా జెన్ డియాస్ . ఈ సినిమాలో తన అందంతో కుర్రను ఆకట్టుకున్న ఆ తర్వాత సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీ కి ఈమె దూరమైంది.
అంజలి లవానియా:
పంజా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన అంజలి లవానియా బాలీవుడ్ లో ఆ టైంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఈమే తెలుగులో పంజా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆమె ఆశలన్నీ నేలమట్టం చేసింది. ఈ సినిమా తర్వాత ఈమి తెలుగు ఇండస్ట్రీ ఇలో మరో సినిమాలో కనిపించలేదు. వీరే కాకుండా ఇంకా సినిమాల్లో నటించి ఆ తర్వాత ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ప్రధానంగా అలాంటి వారిలో కీర్తి రెడ్డి, నికిషా పటేల్ , మీరా చోప్రా, ప్రీతి జింగానియా వంటి వారు కూడా ఉన్నారు.