రావు రమేష్ సినిమాల ద్వారా యెంత గడించారో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!

రావు రమేష్… పరిచయం అక్కర్లేని పేరు. ఇపుడున్న తెలుగు క్యారెక్టర్ ఆరిస్టులలో చెప్పుకోదగ్గ నటుడు మన రావు రమేష్. ఈయన అలాంటి టాలెంటెడ్ నటుడు రావు గోపాలరావు కొడుకు అన్న సంగతి అన్న విషయం విదితమే. అలాగే ఈయన అమ్మగారు కమల కుమారి కూడా ఓ సుప్రసిద్ధ హరికథ కళాకారిణి. ఈ దంపతులకు 1970లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు మన రావు రమేష్. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సినిమాలలోకి రావాల్సి వచ్చింది.

ఇక రావు రమేష్ కు ఇద్దరు సంతానం. ఒక కుమారుడు, ఒక కుమార్తె. తల్లి ప్రోత్సాహంతో సినిమాల వైపు దృష్టి పెట్టాడు. మొదటి సినిమా బాలకృష్ణ నటించిన సీమ సింహం సినిమాలో సిమ్రాన్ కు సోదరినిగా ఒక చిన్న పాత్రలో అవకాశం వచ్చింది. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. తిరిగి చెన్నై వెళ్ళిపోయి టీవీ ధారవాహికలు అయినా పవిత్ర బంధం, కలవరి కోడలు నటించాడు. ఆ తరువాత తెలుగులో 2007లో ఒక్కడున్నాడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తరువాత వచ్చిన గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర వేసి మెప్పించారు. 2008 లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమా లో లెక్చరర్ గా ఎంట్రీ ఇచ్చి తన నాన్నకు తగ్గ గౌరవం గొప్ప పేరు పరీక్షలు సంపాదించారు.

ఇక ఆ తర్వాత మగధీరలో బోరా పాత్రలో నటించారు. చాలామందికి తెలియదు ఆ పాత్రలో ఉన్నది రావు రమేష్ అని. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తన తండ్రి నటనకు ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా వారసత్వం అందిపుచ్చుకునే విధంగా పలు సినిమాలలో నటించి గొప్ప పేరు పొందారు. ఇకపోతే ఆయన సినిమాల ద్వారా యెంత గడించాడు అనే విషయంలోకి ఒకసారి వెళితే… ఒకప్పుడు ఆయన పుట్టగొడుగుల వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాతి కాలంలో ఈయన రోజుకు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకొనేవారు. ప్రస్తుతం ఈయనదగ్గర దాదాపు 5 కార్లు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ శ్రీకాకుళం చెన్నైలో నివాసాలు,పలు కమర్షియల్ కాంప్లెక్స్ లు, కొన్ని వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయని సమాచారం. మొత్తంగా 50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం.