కేజిఎఫ్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్అవడంతో ఈ సినిమా యూనిట్కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ క్రమంలోనె సినిమాకి సంబంధించిన కీలక వీడియోస్, ఫోటోలు అన్నీ కూడా లీక్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ఈ సినిమాకు సంబంధించిన భారీ ఫైట్ వీడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
దీంతో సినిమా యూనిట్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కఠినమైన నిబంధనలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. షూటింగ్ జరిగే ప్రాంతంలోకి ఇకనుంచి ఎవరు మొబైల్స్ తీసుకురావద్దని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఆయన లీకులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కే జి ఎఫ్ సినిమా నిర్మించినహోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.