దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరుపొందింది నయనతార. తాజాగా ఈమె డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకొని తన దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నది. ఇక వీరిద్దరికి వివాహమైనప్పటినుంచి వీలైనప్పుడల్లా ఇతర దేశాలను చుట్టేస్తే చాలా సంతోషంగా అక్కడ అందాలను ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది వాటి గురించి తెలుసుకుందాం.నయనతార, విగ్నేష్ పెళ్లికి ముందే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నయనతార గర్భసంచి చాలా బలహీనంగా ఉండడంతో ఆమెకు పిల్లలు కనే భాగ్యం లేదని వార్తలు తమిళ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక అంతే కాకుండా నయనతార పిల్లలను కంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్లుగా వైద్యులు సూచించినట్లు సమాచారం. అందుచేతనే నయనతార వివాహం తర్వాత పిల్లలు కావాలి అంటే తాను సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలని భావించిందట. అయితే ఈ విషయం విగ్నేష్ కు ఏమాత్రం నచ్చలేదట. అయితే వివాహం తర్వాత వీరిద్దరూ ఒక అనాధ బిడ్డను దత్తకు తీసుకొని పెంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తమిళ మీడియాలో ఈ వార్త చాలా వైరల్ గా మారుతోంది.ఇలా వీరిద్దరి మధ్య పిల్లలు విషయంలో ఒప్పందచుకున్న తర్వాతే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే పలువురు నెటిజన్లు మాత్రం ఎంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం అసలైన తల్లి ప్రేమను పొందలేదా అని అభిమానులు చాలా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లో హీరో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆట్లిర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ విషయంపై నయనతార స్పందిస్తుందేమో చూడాలి.