కృతీసనన్ బాలీవుడ్లో తన సినీ కెరియర్ను మొదలుపెట్టి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు అనుకొన్నంత ఇమేజ్ను తీసుకు రాకపోవడంతో, తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అడకపోవడంతో. టాలీవుడ్ లో అవకాశాలు రాక మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
బాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది. తాజాగా కృతీససన్ బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. కృతి ఈ షోలోకొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిందట. కెరియర్ మొదటిలో చాలా అవమానాలకు గురైంది. దీంతో పాటు కొన్ని సినిమా అవకాశాలు వచ్చినా వాళ్ల అమ్మకు ఇచ్చినా బోల్డ్ కంటెంట్తో ఉన్న సినిమాలు చేయనని ఇచ్చిన మాట వల్ల నటించలేక పోయిందట.
కృతి తన మొదటి సినిమా కంటే ముందే ఓ వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చినా నటించలేదట. దీనికి కారణం సిరీస్ అంతా బోల్డ్ కంట్ ఎక్కువగా ఉండటంతో నటించలేకపోయాని చెప్పింది. వీటితోపాటు తన పొడుగు కూడా సినిమా అవకాశాలకు రాకపోవటానికి కారణమైందని కృతిసన్ చెప్పింది. చాలా ప్రయత్నాల వల్ల మంచి అవకాశాలు వచ్చాయని కృతి చెప్పింది.. కృతి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది.ప్రభాస్ తో ఆది పురుష్ సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు నటించే అవకాశాలు వచ్చాయని తెలిసింది వాటిపై ఇంకా అధికార పర్యటన రాలేదు.