స్టార్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నీయన్ సెల్వన్. ఈ సినిమా షూటింగ్ కూడా గత కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాలో చాలామంద స్టార్స్ సైతం నటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, త్రిష కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్లు విడుదల చేయగా అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా గురించి హీరోయిన్ త్రిష ఒక విషయం తెలిపింది.
పొన్నీయన్ సెల్వన్ సెల్వన్ చిత్రాన్ని కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం ఈ చిత్రం చారిత్రాత్మక కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగాన్ని ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమైంది చిత్ర బృందం. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిష ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
త్రిష మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా సరదాగా గడిపాను.. ఐశ్వర్యరాయ్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఐశ్వర్యారాయ్ అందం గా ఉండడం మాత్రమే కాకుండా ఆమె మనసు కూడా వెన్న అని తెలియజేసింది. ఈ సినిమాలో మాత్రం మేమిద్దరం బద్ధ శత్రువుల కనిపిస్తాము కాని షూటింగ్ సెట్లో మేమిద్దరం చాలా సరదాగా ఉండే వాళ్ళమని తెలిపింది. అంతేకాకుండా మణిరత్నం గారు మా ఇద్దరిని కలిపి ఒకే చోట షూటింగ్ సెట్ లో ఉండవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిపింది. సినిమాలో సన్నివేశాలలో తామిద్దరి పాత్రల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉండాలని..కానీ మేము షూటింగ్ సమయంలో అలా ఉండలేకపోతున్నామని దాంతో మణిరత్నం గారు మా ఇద్దరిని కలవకూడదని వార్నింగ్ ఇచ్చారని తెలిపింది. అప్పటినుంచి కాస్త దూరంగా ఉంటున్నామని తెలియజేసింది త్రిష.