ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్-2022కు ముందు టీమిండియాకు ఆసియా కప్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాయంతో భారత స్టార్ పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది. గాయంతో బాధపడుతోన్న బుమ్రా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతో పాటు టీ20 ప్రపచంకప్కు కూడా అందుబాటులో ఉండనున్నట్టు టాక్?
తాజాగా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. బుమ్రా గాయం నుంచి కోలుకోవడంతో పాటు తిరిగి ఫిటెనెస్లోకి కూడా వచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో బూమ్రా ఇండియాలో ఆసీస్, దక్షిణాఫ్రికా సీరిస్లతో పాటు వన్డే 20 ప్రపంచకప్కు కూడా అందుబాటులో ఉంటాడని బీసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
దీంతో భారత క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో మూడు టీ20ల సిరీస్ నిమిత్తం ఆసీస్ జట్టు భారత్లో పర్యటిస్తుండగా… ఆదే నెలలో దక్షిణాఫ్రికా జట్టు కూడా ఐదు టీ20ల సిరీస్ కోసం భారత్ రానుంది.