సావిత్రికి బుద్ధి లేదు.. అందుకే చనిపోయినా వెళ్లలేదంటూ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి నటి కృష్ణకుమారి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె తన సినిమాలలో అందం, నటనాభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. నవరత్నాలు అనే సినిమాతో పదహారేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆమెకు 14 సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె మొదటి సినిమా నుంచి మొదలు ‘బంగారు పాప’ సినిమా వరకు అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినీ ఇండస్ట్రీలో ఆమెపై ‘ఫ్లాప్ హీరోయిన్’ అనే ముద్ర వేశారు. ఈ విషయం గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించిన ఆమె ‘కావాలనే వేరే హీరోయిన్లను నటింపజేయడానికి ఏదో ఒక సాకు చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు నన్ను సినిమాలలో నుంచి తప్పించారు’ అని చెప్పింది.

కృష్ణకుమారి తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తూ 20 సంవత్సరాలు పైగా ప్రేక్షకులను అలరించింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీ గణేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక అప్పట్లో ఎన్టీఆర్ సరసన నటించిన ‘లక్షాధికారి’ అనే సినిమాలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకొని సంచలనం సృష్టించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో అలనాటి మహానటి సావిత్రి గురించి కృష్ణకుమారి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కృష్ణకుమారి మాట్లాడుతూ.. ‘సావిత్రి జీవితం చివరి రోజుల్లో తన జీవితంలో దిగజారి మరీ ప్రవర్తించడం చూసి నాకు చాలా కోపం వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఆవిడ. ఆమె బుద్ధి ఏమైంది? పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఉంటే మాత్రం.. అలా దిగజారుతారా? అందుకే సావిత్రి చనిపోయినప్పుడు కూడా నేను చూడటానికి వెళ్లలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా కృష్ణకుమారి 2018 జనవరి 24న మరణించిది.