మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఇదే క్రేజ్ తో రామ్చరణ్ నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు RC15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇది వీరిద్దరి కాంబోలో రెండవ సినిమాగా వస్తుంది.ఈ సినిమా శంకర్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు.
ఇదే క్రమంలో రామ్ చరణ్ తర్వాత సినిమాలపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ తర్వాత సినిమా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఉంటుందని అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో వీరిద్దరి సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త బయటకు వచ్చింది. తాజాగా డైరెక్టర్ రామ్ చరణ్కు ఓ కథ చెప్పారట. స్టోరీ రామ్ చరణ్ కి నచ్చక పోవడంతో ఆయన రిజెక్ట్ చేశారని సినీ వర్గాలలోని విశ్వసినీయ వర్గాల నుంచి వార్తలు బయటకు వచ్చాయి.
ఇక దీంతో గౌతమ్ తిన్ననూరి సినిమా పక్కన పెట్టేసారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ విషయంపై రామ్ చరణ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు సినిమా ఆగిపోవడానికి సంబంధించిన విషయం పై అధికార ప్రకటన ఇంకా రాలేదు.