ఎన్ని మనస్పర్ధలు వచ్చినా.. పూజా హెగ్డేని వదలని యూవీ..?

అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనూ హిట్ అందుకుంది. తర్వాత రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేసింది. తర్వాత ఎఫ్3 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు కభీ ఈద్ కభీ దివాలీ, సర్కస్ అనే 2 హిందీ సినిమాల్లో, మహేష్ బాబుతో కలిసి ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ లాస్ట్‌గా నటించిన మూడు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడం లేదు.

తాజా రిపోర్ట్స్ ప్రకారం, పూజా హెగ్డే మరో రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. వాటిలో ఒకటి తమిళ్ హీరో సూర్య 42 మూవీ. ఈ సినిమా గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ కంపెనీలు కలిసి నిర్మించనున్నాయట. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానుల్లో ఒక సందేహం తలెత్తుతోంది. అది ఏంటంటే, రాధేశ్యామ్ షూటింగ్ టైమ్‌లో పూజా, యూవీ క్రియేషన్స్ మధ్య చాలా మనస్పర్థలు వచ్చాయి. ఈ హీరోయిన్ బిహేవియర్ చూసి యూవీ టీమ్‌ చాలా అసహనం వ్యక్తం చేసిందని వార్తలు కూడా వచ్చాయి. మళ్లీ ఈ జన్మలో ఆమెను తీసుకోకూడదని యూవీ టీమ్ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

మరి మళ్లీ ఇప్పుడు ఏరికోరి ఆమెకి తమ సినిమాలో ఎందుకు అవకాశం ఇచ్చినట్టు? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఈ అగ్రతారకి ఉన్న క్రేజ్ వల్ల కాంప్రమైజ్ అయి ఒక మెట్టు కిందికి దిగారు? లేక సూర్య స్టూడియో గ్రీన్ విజ్ఞప్తి మేరకు ఆమెను ఓకే చేసారా? అనే వివిధ కోణాల్లో సినీ ప్రేక్షకులు డిస్కషన్ చేస్తున్నారు.