రాఖీ కట్టిన చెల్లికి కళ్ళు చెదిరే బహుమతి ఇచ్చిన ఎన్టీఆర్..!

ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా రాఖీ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు రక్షాబంధన్ వేడుకను జరుపుకోవడం జరిగింది. ఇక ఎంతో ఆప్యాయంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఇకపోతే ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ కి ఆయన చెల్లెలు బ్రాహ్మణి ఏకంగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి రాఖీ కట్టడం చాలా సంతోషాన్ని కలిగించింది.Nara Brahmani made Jr NTR to cry

బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మినికి తన అన్న ఎన్టీఆర్ అంటే విపరీతమైన ప్రేమ అభిమానం .ఈ కారణంగానే ఎక్కువగా ఎన్టీఆర్ తోనే తన సమయాన్ని స్పెండ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని నిన్న తన అన్నయ్య ఇంటికి వచ్చి మరి రాఖీ కట్టిందట బ్రాహ్మణి. ఇక బ్రాహ్మణి రాఖి కట్టడంతో తనకు కళ్ళు చెదిరే సర్ప్రైజ్ ఇచ్చారట ఎన్టీఆర్. అంత ప్రేమగా చెల్లి వచ్చి రాఖీ కడితే ఎవరు మాత్రం సంతోషపడరు. ఇక ఈ నేపథ్యంలోనే అన్న ఎన్టీఆర్ చెల్లి బ్రాహ్మినికి ఒక అద్భుతమైన కానుకను అందజేసి ఆమెను సంతోషపెట్టినట్లు సమాచారం.Nara Brahmani's name surfaces in TDP camp?

ఇక ఏమిటా బహుమతి అంటే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసి డైమండ్ నెక్లెస్ ను ఆమెకు బహుమతిగా అందించారట ఎన్టీఆర్. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాలు ఎంతలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం బుచ్చిబాబు సనాతో ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.