మహేష్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇవ్వబోతున్న మెగా ఫాన్స్..!!

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఆయన నటించబోతున్న అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి ఎటువంటి టీజర్స్ , ట్రైలర్స్ లేకపోవడంతో మళ్లీ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున స్పెషల్ షోలను స్క్రీనింగ్ చేసి మంచి లాభం పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 100 స్క్రీన్స్ లో అనుకుంటే ఏకంగా 350 స్క్రీన్ వరకు ఈ సినిమా ఆడింది. అంతేకాదు ఎక్కడ చూసినా మహేష్ బాబు సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో మహేష్ బాబు అభిమానులు సూపర్ హిట్ అయ్యారని చెప్పవచ్చు. ఇక పోకిరి సినిమా ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.Mahesh Babu-Chiranjeevi to share screen space?

ఇకపోతే పోకిరి సినిమా రీ రిలీజ్ చేసినా కూడా రూ.2.5కోట్ల వరకు వసూల్ నమోదయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం గమనాభం. ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి బర్తడే సందర్భంగా ఘరానా మొగుడు సినిమాలో భారీగా స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. హైదరాబాదులో అన్ని ప్రముఖ సింగిల్ స్క్రీన్ లలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం దేశవ్యాప్తంగా మహేష్ బాబు మరియు చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున ఉన్న విషయం తెలిసింది.28 Years for Gharana Mogudu: 4 fascinating things about the Chiranjeevi starrer | The Times of India

ఈ క్రమంలోనే చిరంజీవి ఘరానా మొగుడు సినిమాకు వచ్చే వసూలతో మహేష్ బాబు అభిమానులకు కౌంటర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహేష్ బాబు సినిమా స్థాయిలో ఘరానా మొగుడు విడుదల అనేది అసాధ్యం కానీ మెగా ఫాన్స్ కొద్దిగా అయినా సరే ఆ దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.