మహేష్ బాబు ది త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది అతడు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. రెండవది ఖలేజా ఈ సినిమా ఓ మోస్తారు హిట్గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమా స్సంబ్28 అనే వర్కింగ్ టైటిల్ తో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక ఇదే సందర్భంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. త్రివిక్రమ్ ఈ సినిమాకి అరవింద సమేత ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ న్యూస్ బయటకువచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మహేష్ సినిమా కోసం ఎన్టీఆర్ హిట్ సినిమాని ఫాలో అవుతుండటంతో ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
అరవింద్ సమేత ఫస్ట్ డేషూటింగ్ ని భారీ యాక్షన్ సీన్స్ తో షూటింగ్ ని ప్రారంభించారు. ఇదే కోవాలో మహేష్ బాబు సినిమాని కూడా త్రివిక్రమ్ యాక్షన్ సీన్తో షూటింగ్ ప్రారంభించాలని రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్స్ సెట్ ను వేస్తున్నాడు. మహేష్ బాబు సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.