టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. సరికొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ఇందులో సిద్దు కామెడీ టైమింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం.
ఇదంతా ఇలా ఉండగా డీజే టిల్లు సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శెట్టి రాధికా పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్లో ఈమె నటించబోదు అన్నట్లుగా సమాచారం. నేహా శెట్టి ప్లేస్ లో ఒక స్టార్ హీరోయిన్ అనుకుంటున్నట్లుగా సమాచారం. రాధిక పాత్ర సీక్వెలలో మలయాళం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక హీరోతో పోటీగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండడంతో అనుపమ కూడా ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా తను నటించిన కార్తికేయ -2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. త్వరలోనే 18-పేజెస్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమా సీక్వెల్ లో అనుపమ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందా అనే విషయంపై చిత్ర క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. మరి ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో ఓకే చెప్పినా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో అంటూ ఆమె అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.