తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు ఈయన నటనతో ఎంతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఎంతోమంది అభిమానులను కూడా సొంతం అన్నారు కేవలం నటుడు గానే కాకుండా రాజకీయపరంగా కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో ఈయనకి పేరు తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇక సినీ ఇండస్ట్రీలోని మళ్లీ హీరోగా కొనసాగించేందుకు రీఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్-150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.పైగా యువ హీరోలతో పోటీపడి వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఈయన ఖాతాలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఆచార్య సినిమాతో ప్లాప్ ను మూట కట్టుకున్నాడు చిరంజీవి. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ సినిమా ఎందుకో సక్సెస్ కాలేక పోయింది. ఇక డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి ,రామ్ చరణ్ కు కూడా ఈ సినిమా తీవ్రమైన నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. టాలీవుడ్ మీద హీరో చిరంజీవి సినిమా కాబట్టి సినిమా విడుదలకు ముందే ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ లభించింది.
ఈ సినిమా విడుదలయ్యాక రిజల్ట్ ను చూసి అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోయారు దాంతో తన తదుపరి చిత్రంపై చాలా ప్రెషర్ పడుతోందని చెప్పవచ్చు చిరంజీవికి. ఇక చిరంజీవి కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు సమాజంలో జరిగే కొన్ని సంఘటన పైన ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు. ఇక ఏదైనా పండుగల సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఇక ట్విట్టర్ నుంచి రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఒక నిటిజన్ అన్నయ్య నిన్ను అన్నయ్యగా భావించే వాళ్ళందరికీ బోళాశంకర్ ఆపేసి రక్షాబంధన్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా అని కామెంట్లు చేశారు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నది. ఇక ఈ సినిమా తనకి బాగోదని నటించకపోవడమే మంచిదని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు మరి ఈ సినిమాపై చిరంజీవి ఎలా స్పందిస్తాడో చూడాలి.