స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం ఆయన తన నటనతో మాస్ యాక్షన్స్ తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నిజానికి ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమాను బాలీవుడ్ లో ఏ విధంగా కూడా వీరు ప్రమోట్ చేయలేదు కానీ అక్కడ కూడా ఈ సినిమాకు భారి స్థాయిలో ఆదరణ లభించడమే కాకుండా 100 కోట్లకు క్లబ్లో చేరిపోయి బాలీవుడ్ హీరోలు అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా పుష్పం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోని సుకుమార్ కూడా ప్రేక్షకులను మెప్పించడానికి సరికొత్త పాత్రలను రంగంలోకి దింపుతూ కథను మరింత రసవత్తరంగా సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ నటన మీద ఆసక్తితోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడుఇక తన మేనమామ చిరంజీవి నటించిన విజేత సినిమాలో 1995లోనే తను స్కూలింగ్ చదివేటప్పుడు నటించాడు. అంతేకాదు మరో రెండు మూడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అల్లు అర్జున్ ఆ తర్వాత కమల్ హాసన్ తో కూడా కలిసిన నటించడం జరిగింది.అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి .ఇక ఆ సినిమా ఏమిటి అంటే కమలహాసన్, రాధిక ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమాలో ఒక స్కూల్ విద్యార్థిగా అల్లు అర్జున్ మనకు కనిపిస్తారు. ఇక అలా చిన్నతనంలోనే నట విశ్వ విఖ్యాత అయినటువంటి కమలహాసన్తో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ . ఈ విషయం తెలుసుకున్న ఇటు అల్లు అర్జున్ అభిమానులు అటు కమలహాసన్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.