ఆ షోలో సమంత సీక్రెట్ చెప్పేసిందా.. అక్కినేని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఆమె నాగచైతన్యతో విడిపోయాక ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ సంవత్సరం తన కాఫీ విత్ కరణ్‌ షోలో ఆమె అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె షోలో పాల్గొంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో కరణ్ జోహార్‌ను ఆమె వేలెత్తి చూపించింది. వివాహాలు సంతోషంగా లేకపోవడానికి అతనే కారణమని పేర్కొంది. ఇప్పటి వరకు నాగచైతన్యతో ఎందుకు విడిపోయిందో సమంతా ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. వారి విడాకులకు గల కారణాలపై కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు చాలా ఉత్కంఠగా ఉన్నారు. దీనిపై కాఫీ విత్ కరణ్ షోలో ఆమె ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందేమోననే ఆందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సమంత-నాగచైతన్య అక్టోబర్ 2021లో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, అందరికీ షాక్ ఇచ్చారు. సమంతా రూత్ ప్రభు ఇటీవల తన కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఆ టాక్ షో జూలై 7 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇటీవల, కాఫీ విత్ కరణ్ టీజర్‌ను విడుదల చేశారు. సమంత అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ షోలో ఆమె ఏం చెప్పిందో ఇంత వరకు ఎవరికీ తెలియదు.

అయితే విడాకుల అంశం గురించి ఆమె ఈ షోలో స్పష్టత ఇచ్చిందని పలువురు భావిస్తున్నారు. షో రిలీజ్ అయిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ఇక సమంత చివరిసారిగా ‘కథువాకుల రెండు కాదల్‌’లో ఖతీజా బేగం పాత్రలో కనిపించింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న దర్శకుడు గుణశేఖర్ చిత్రీకరించిన ‘శాకుంతలం’ విడుదలకు రెడీగా ఉంది. అంతేకాకుండా దర్శక ద్వయం హరి-హరీష్ తెరకెక్కించిన ‘యశోద’, విజయ్ దేవరకొండ సరసన ఖుషీ, హాలీవుడ్ సినిమా ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ కూడా ఉన్నాయి.