ప్రభాస్ కాలికి సర్జరీ.. కలవరపడుతున్న ఫ్యాన్స్..!!

సినిమా అనేది చాలామందికి బ్రతుకు తెరువు అయితే మరి కొంతమందికి ప్యాషన్ అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా సినిమాలలో నటిస్తే క్రేజ్ లభిస్తుంది కదా అని ఆలోచించేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇలాంటివారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంత డెడికేటివ్ గా పనిచేస్తారు అంటే తమ ప్రాణాల మీదకు వచ్చినా సరే ప్రేక్షకులను అలరించడానికి.. పాత్ర పండడానికి కష్టపడి మరీ సన్నివేశాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి అనారోగ్యం భారిన పడుతున్నారని చెప్పవచ్చు. ఇక ప్రాణాల మీదకు వచ్చినా లెక్కచేయకుండా సినిమాలలో నటించే ఎంతోమంది స్టార్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. అప్పుడప్పుడు అనారోగ్య పాలవుతున్నా సరే సినిమాలలో యాక్షన్ సీన్స్ లో నటించడం మాత్రం తగ్గించడు అని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా తన కాలికి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Prabhas' Mega Projects To Face Major Setback As Telugu Film Shootings Halted From August 1 - Indiaahead News

ఇకపోతే ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్ళాడు అని ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ గురువారం వెల్లడించారు. ప్రాజెక్టు కే సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ప్రభాస్.. సీతా రామం ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా రావాల్సి ఉంది. కానీ సర్జరీ కోసం విదేశాలలోనే ఉండడంతో రాలేకపోయాడు అని నిర్మాత అశ్విని దత్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ గతంలో కూడా సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రాజెక్టు కే సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు నిర్మాత అశ్విని దత్ తెలిపాడు. ఇకపోతే ఒకవేళ కుదరకపోతే 2024 జనవరిలో అయినా రిలీజ్ చేస్తామని వెల్లడించారు.

ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాల్లో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ కాలికి సర్జరీ అనగానే ఆయన అభిమానులు కూడా కలవరపడమే కాకుండా తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.