ప్రముఖ అందాల తార సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన నటనతో , అందంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మరి ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇక తెలుగు తెరపై తన అందంతో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈమె కొన్ని వందల సినిమాలలో నటించింది . ముఖ్యంగా 50 సంవత్సరాలు పైగా సినీ ఇండస్ట్రీలోనే తన కెరీర్ ను గడిపిన జయసుధ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ పాత్రలో చేసినా ఆమె నటనలో మాత్రం మార్పు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా 1970 – 1980 లలో తెలుగు, తమిళ్ , మలయాళం పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది జయసుధ.
ఇక జయసుధ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై స్పందించిన జయసుధ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పలు రకాల విషయాలను వెల్లడించింది. జయసుధ మాట్లాడుతూ 50 ఏళ్ళు అంటే ఇదే బాలీవుడ్ లో అయితే శుభాకాంక్షలు తెలిపేవారు. పూల బొకేలు కూడా పంపించేవారు. కానీ ఇక్కడ పూల బొకేలు పంపిన వాళ్లు కూడా ఎవరూ లేరు.. అదే ఒక హీరో అయితే ఇంకోలా ఉండేది. ఇక ఇప్పటికే నాతో చాలామంది ఉన్నారు.. మీరు ఎందుకు పెద్ద పార్టీ 50 ఏళ్ళు కంప్లీట్ చేశామని చెప్పలేదు అని.. నాకది వద్దు అనిపించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో డిస్క్రిమినేషన్ ఉందేమో అనిపించింది.
బాగా సక్సెస్ అయిన హీరోలను ఒకలా ట్రీట్ చేయడం.. హీరోల కంటే హీరోయిన్లను తక్కువ చేసి చూడడం జరుగుతుంది. టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా అదే పరిస్థితి.. ఇప్పటివరకు అలాగే కొనసాగుతోంది. హీరోయిన్ల కంటే వారి పక్కన ఉండే వాళ్ళు ఎక్కువ డ్రామా చేస్తారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అమ్మాయిలకు విలువ ఉండదు. ఒకవేళ నేనే కానీ ఎక్కువ డిమాండ్లు పెట్టి ట్రబుల్ చేసి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంచేవారు కాదు. పంపించేస్తారు. కానీ ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే నా గొంతు వినిపించాను. ఈ ఇండస్ట్రీలో ఇలాంటివి బాగా ఎక్కువయ్యాయి అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీపై జయసుధ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.