కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే ఆయన ప్రతిభ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు ఇకపోతే వీరి వివాహం జరిగి 19 సంవత్సరాల తర్వాత ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంత వేగంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే వేగంగా విడాకులు కూడా జరిగిపోతున్నాయి. నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సరిగ్గా 2 నెలలకు ధనుష్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇక ఇటీవల విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. లేకపోతే ఈ విషయం అటు రజినీకాంత్ తో పాటు ఆయన అభిమానులకు కూడా ఆవేదనను మిగిల్చింది. ఇక ప్రతి ఒక్కరికి తెలిసి ఐశ్వర్య – ధనుష్ కి మధ్య ఎటువంటి వివాదాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఏ రోజు వారు బయటకు చెప్పుకోలేదు. తన పని తాను చేసుకుంటూ బిజీగా ఉండేవాడు ధనుష్.ఇక ఐశ్వర్య కూడా తన తండ్రిలాగే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. ఆమె కూడా వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉంటుంది. ఐశ్వర్యాకు విడాకులు ఇచ్చిన తర్వాత ధనుష్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు . ఇక ఇటీవల ధనుష్ బాలీవుడ్ సినిమా కూడా తీశాడు. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ తో కలిసి ఆంత్రంగీరే సినిమాలో ధనుష్ నటించిన విషయం తెలిసిందే. తాజాగా హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇకపోతే బాలీవుడ్ నిర్మాత రితేష్ సిధ్వానీ.. శుక్రవారం తమ చిత్రం ది గ్రే మ్యాన్ సినిమా ప్రమోషన్స్ కోసం ఇండియా లో వున్న ది రస్సో బ్రదర్స్ జో మరియు ఆంథోనీ రస్సో కోసం స్టార్ స్టడెడ్ పార్టీని నిర్వహించారు. ఇక ఈ పార్టీకి ధనుష్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అలాగే సారా అలీ ఖాన్ కూడా హాజరైంది ముఖ్యంగా సారా అలీఖాన్ ధనుష్తో కలిసి రావడం, అతనితో బాగా క్లోజ్ గా ఉండడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం బాగా నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాదు ఈమె కోసమే తన భార్య ఒక విడాకులు ఇచ్చాడు అంటూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.