బ్రష్ చేయకుండా ముద్దులు.. వద్దు అని మొండిచేసిన భార్యను భర్త ఏం చేశాడో తెలుసా?

యస్..వినడానికి విడ్డూరం గా ఉన్న ఇదే నిజం. ఓ కసాయి భర్త అప్పటి వరకు బాగానే ఉన్నాడు. కానీ, భార్య బ్రష్ చేయకుండా ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పడంతో..కోపం తో రగిలిపోయాడు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా రూమ్ లోకి వెళ్లి కొడవలితో దారుణంగా నరికి చంపేశాడు. ఈ దారుణమైన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కేరళ రాష్ట్రంలోని.. పాలక్కాడ్ జిల్లా మన్నార్క్కాడ్ కరక్కురిస్సీలో.. 30 ఏళ్ల అవినాష్, తన భార్య దీపిక తో కలిసి హ్యాపీ సంసారాని కొనసాగిస్తున్నాడు. నిజానికి ఈయనకి ఇది వరకే పెళ్లైందట. కానీ కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుని..మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ని చాలా బాగా చూసుకుంటూ వచ్చాడు. ఈ భార్య భర్త ల అన్యోన్యతకు..ఇరుగుపొరుగు వాళ్ళు కూడా షాక్ అయ్యారట.

వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. అమ్మ, నాన్న..ఓ బాబు, ముగ్గురు ఉన్న దాంతో సంతోషంగా కాపురాని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే బాబు అంటే ప్రేమగల తండ్రి..నిద్ర లేవగానే బాబు ని ముద్దు పెట్టుకునేందుకు దగ్గరకి వెళ్ళాడు. అయితే భార్య వెంటనే గమనించి.. ఇలా నిద్ర లెవగానే బ్రష్ కూడా చేయకుండా బాబు ని ముద్దు పెట్టుకోవద్దంటూ బాబు పక్కను తీసుకెళ్లిపోయింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగాయి. ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ గొడవకు దిగారు. మాటల మధ్యలో ఆవేశం తో భర్త..భార్యను దారుణంగా నరికి చంపేశాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన.. ఫలితం లేకపోయింది. అప్పటికే దీపిక ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవినాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.