నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. అరుదైన గౌరవం దక్కించుకున్న బాలయ్య..!!

నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐదు పదుల వయసు దాటినా కూడా నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అప్పట్లో ఎంత ఎనర్జీతో అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. సినిమాలలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోవడమే కాకుండా రాజకీయాలలో కూడా చాలా హుషారుగా ఉంటూ తనదైన శైలిలో హిందూపురం అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఒకవైపు బాలకృష్ణ క్రేజీ అప్డేట్ లతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరొకవైపు బాలకృష్ణ నుంచి మంచి కిక్ ఇచ్చే అప్డేట్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.Nandamuri Balakrishna All Set To Appear On Indian Idol Telugu As Special  Guest

ఇక అసలు విషయంలోకి వెళితే.. అత్యంత అరుదైన గౌరవాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఆయనకు సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణఖంకన పురస్కారం అందజేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మహాకవి సి నారాయణరెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 30వ తేదీన రవీంద్ర భారతిలో బాలకృష్ణకు ఈ పురస్కారం అందజేయబోతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు హాజరు కాబోతున్నట్లు సమాచారం

బాలకృష్ణ ఈ అరుదైన పురస్కారాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు కూడా హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఈయన సినిమా విషయాలకు వస్తే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కంప్లీట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు బాలయ్య.