“నా కూతురికి అన్యాయం చేశాడు”..ఆ డైరెక్టర్ పై కాజల్ మదర్ ఫైర్..?

టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఓ చందమామ ల వచ్చింది అందాల తార కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఆ సినిమా లో తన ట్రెడిషినల్ లుక్స్ తో అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి కంట్లో పడి ..మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమ్మడు మిత్రవింద గా కనిపించిన తీరు అందరికి నచ్చింది.

ఈ సినిమా తరువాత అమ్మడు జాతకం మారిపోయింది, వరుసగా కోలీవుడ్ అవకాశాలు..తెలుగులో బడా స్టార్స్..క్రేజీ ఆఫర్లతో ఒకానోక టైంలో ఇండస్ట్రీని ఏలేసింది. కుర్ర బ్యూటీలు ఎందరు ఉన్నా..కానీ అందరు హీరోలు కాజల్ నే కావాలంటూ ఆమె కోసం కోట్లు పోసి కాల్ షీట్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే, కెర్రీర్ పీక్స్ లో ఉండగానే బాల్య స్నేహితుడు గౌతం ను ప్రేమించి పెళ్లి చేసుకుని..త్వరగా ఓ బాబుని కూడా కనేసింది.

ప్రజెంట్ సెకండ్ ఇన్నింగిస్ కోసం ట్రై చేస్తున్న కాజల్..ఓ డైరెక్టర్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు..కొరటాల శివ. ఆచార్య సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని సెలక్ట్ చేసి..కొన్ని షాట్స్ తీశాక..ఆమెను సినిమాను నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ టైంలో కొరటాల పై కాజల్ ఫ్యాన్స్ దారుణంగా బూతులు తిట్టారు. ఇక ఆ టైంలోనే కాజల్ మదర్ కూడా కొరటాల పై సీరియస్ అయ్యిన్నట్లు వార్తలు వచ్చాయి. నమ్మించి..కాజల్ ని మోసం చేశాడు అంటూ ఆమె కొరటాల పై కోపడిన్నట్లు మీడియాలో ఆ టైంలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే, సీన్ కట్ చేస్తే..ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పుడు కూడా కాజల్ ఫ్యాన్స్ కొరటాలను టార్గెట్ చేశారు..కాజల్ ఉసురు తగ్గిలింది అంటూ కామెంట్స్ చేసారు. ప్రజెంట్ కొరటాల తారక్ తో ఓ సినిమా చేస్తున్నాడు. కాజల్ అయియే సెకండ్ ఇన్నింగ్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నత్లు తెలుస్తుంది.