బండ్ల ఫ్ర‌స్టేష‌న్‌ వెనుక రీజన్ అదేనా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంచలన మ్యాటర్..?

సినీ ఇండస్ట్రీ లో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉండవు. నేడు హీరోలు గా ఉన్న వాళ్ళు రేపు జీరోలు అవుతారు.. జీరోలు గా ఉన్న హీరోలు స్టార్స్ అవుతారు. అలాగే చాలా సంధర్భాలల్లో జరిగాయి. ఇప్పుడు అలాంటి పోజీషన్ నే ఎదురుకుంటున్నాడు..కమెడీయన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్..అలియస్ పవన్ కల్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఒక్కప్పుడు బండ్ల గణేష్ కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెర పై ఆయన బొమ్మ పడితే విజిల్స్ మారుమ్రోగిపోయేవి.

అయితే, రాను రాను ఆయన కమెడియన్ గా కాకుండా నిర్మాత గా నే ఉండేదందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తూ..వచ్చాడు. తన దైన స్టైల్ లో ..మంచి మంచి సినిమాలు చేస్తూ..టాలీవుడ్ టాప్ నిర్మాత గా మారిపోయారు. అయితే, గత కొన్నాళ్ళ నుండి ఈయనకు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. అటు నిర్మాణ రంగంలోను..ఇటు నటన పరంగా బండ్ల కి అవకాశాలు తగ్గాయి. దీంతో బండ్ల గణేష్ మైండ్ దొబ్బింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బండ్ల స్టేజీ ఎక్కి మైక్ పడితే ..సౌంద్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజకీయ నాయకులు కూడా బండ్ల ముందు వేస్ట్ అనిపించేంతలా జనాలను మౌల్డప్ చేసేస్తారు తన మాటలతో బండ్ల. అయితే, రీసెంట్ గా ఆయన చోర్ బజార్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో పూరీ పై చేసిన వ్యాఖ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో బండ్ల పై హూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన కు సినిమా అవకాశాలు లేకనే ఇలా ఫ్రస్టేషన్స్ లో నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడని..ఎవ్వరైన ఆయనకు సినిమా అవకాశాలు ఉంటే ఇవ్వండి అంటూ వెటకారంగా సెటైర్స్ వేస్తున్నారు. మరికొందరు బండ్ల స్పీచ్ కి తప్పిస్తే మరోపనికి పనికిరారు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రస్టేషన్ లో అన్నారో..వాంటెడ్ గా అన్నారో తెలియదు కానీ..మొత్తానికి బండ్ల అయితే తన పరువు పోగొట్టుకున్నారు.