సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యయి. ఇక ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్ అవతారం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా తెలియజేశారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్కు చిత్ర యూనిట్ తాజాగా డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. సర్కారు వారి పాట చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ను మే 7న హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ ఈవెంట్కు మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో రాబోతున్నట్లు చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథి ఎవరనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మహేష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ఎవరు వస్తారా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.