వాళ్లతో పనిచేయడం టైం వేస్ట్‌..మహేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయ్. యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మేజర్”. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. మేజర్ ట్రైలర్ సినిమా ను విడుదల చేసాడు మహేశ్ బాబు. ఈ క్రమంలో అయన మీడియా తో మాట్లాడుతూ..పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇక ఇదే టైంలో ఆయనని రిపోర్టర్స్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా..మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. “నిజానికి నాకు బాలీవుడ్ నుండి బోలెడు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కాని నేనే వాటిని ఓకే చేయడం లేదు. నన్ను బాలీవుడ్ ఇండస్ట్రీ భరిస్తుందని నేను అనుకోవడం లేదు. అలా నన్ను భరించలేని ఇండస్ట్రీతో పని చేయడం వేస్ట్ అనుకుంటున్నా. అయినా నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీని వదిలేసి..వేరే వైపు వెళ్లడం ఇష్టం లేదు. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని విడిచి మరేదో ఇండస్ట్రీకి వెళ్లి పని చేయాలనే ఆలోచనే నాకు లేదు” అంటూ కుండ బద్ధలు కొట్టిన్నట్లు చెప్పేశాడు .

దీంతో మహేశ్ చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. మహేశ్ వ్యాఖ్యల పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే ..మరికొందరు..నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని ..తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు. ఇక మహెశ్ ఫ్యాన్స్ వాళ్లకి కౌంటర్లు ఇస్తూ.. పాన్ ఇండియా సినిమాలు అంటూ పక్క ఇండస్ట్రీలోకి తొంగి చూడటం మా హీరోకి చేత కాదు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు మహేశ్.. ఆయన అభిప్రాయం చెప్పాడు అందులో తప్పు లేదు. ఎవ్వరిని కించపరచడానికి మాట్లాడలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో మహేశ్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి చూడాలి ఈ ఇష్యూ ఎలా సాల్వ్ చేస్తారో..?