ఎన్టీఆర్ కోసం నేషనల్ క్రష్.. మామూలుగా ఉండదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక కొమురం భీమ్ పాత్రలో తారక్ నటవిధ్వంసం సృష్టించడంతో, ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో తారక్ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ప్లాన్‌ను రెడీ చేశాడు తారక్. ఇక ఈ సినిమాలో స్లిమ్ లుక్‌లో కనిపించే తారక్, తన పర్ఫార్మెన్స్‌తోనూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. రీసెంట్‌గా ఆమె పెళ్లి చేసుకోవడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరో హీరోయిన్‌ను ఈ సినిమాలో తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే అందాల భామ పూజా హెగ్డేను ఈ సినిమాలో తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ప్రస్తుతం యమ బిజీగా ఉండటంతో ఈ సినిమాలో నటించే ఛాన్స్ లేదట. దీంతో ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందనను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రష్మిక వద్దకు ఈ సినిమా ఆఫర్‌ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఈ సినిమాను ఓకే చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా నటించే రష్మిక, తారక్ రూపంలో ఓ గట్టి పోటీ ఎదురవబోతుంది. తారక్ కూడా సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా నటిస్తాడో మనకు తెలిసిందే. మరి ఈ ఇద్దరు కలిసి నటిస్తే.. ఆ సినిమా ఎలా ఉండబోతుందా అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.