250 కోట్ల స్కామ్‌లో హీరోయిన్‌ జెనీలియా… ఇంత పెద్ద స్కాం వెన‌క ఏం జ‌రిగింది..!

తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ జెనీలియా గురించి తెలియని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన సినిమాల ద్వారా తన క్యూట్ క్యూట్ అందాల ద్వారా అంతలా గుర్తింపు సంపాదించుకుంది జెనీలియా. తుజే మేరీ కసం అనే హిందీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా తమిళంలో బాయ్స్ అనే సినిమాలో నటించింది.

ఇక తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తర్వాత సాంబ, నా అల్లుడు, సై లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇక అన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బొమ్మరిల్లు సినిమా తో మాత్రం వచ్చేసింది. ఈ సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలోని హాసిని పాత్ర ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంది. నోరు తెరిస్తే చాలు గలగలా మాట్లాడే ఒక అల్లరి పిల్లలా కనిపించి ప్రతి ఒక్కరిని తన నటనతో మెప్పించింది జెనీలియా.

ఇక ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ కాగా అక్కడ కూడా నటించింది జెనిలియనే అంటే ఆ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది ప్రత్యేకంగా కనపడలేదు. ఇక రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది జెనీలియా. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది అని చెప్పాలి.జెనీలియా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఇక ఆమె ఏకంగా 250 కోట్ల స్కామ్ పాల్పడింది అంటు జెనీలియా పై ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావడం సంచలనంగా మారింది. అంజనీపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని తిరుపతయ్య అనే వ్యక్తి ఫిర్యాదులో ఆరోపించాడు.

కంపెనీ డైరెక్టర్ లో కూడా ఆమె ఒకరని.. తన ప్రకటన ద్వారా ఎంతో మందిని ఆకర్షించి కంపెనీలో పెట్టుబడులు పెట్టేలా చేసిందని.. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి 250 కోట్ల వరకు స్కామ్ పాల్పడిందని ఆయన ఆరోపించారు. మహేశ్వరం మండలంలోని కల్వకోల్ గ్రామం లో ఆ వెంచర్ ఉందట. ఇక ఇలా తప్పుడు భూములను చూపించి మోసం చేసిందంటూ కేసు నమోదు కాగా ఇప్పటి వరకు ఈ కేసు విచారణ లోనే ఉంది.