వావ్: కేకపెట్టించే కాంబో..చిరు కొడుకుగా ఆ స్టార్ హీరో..పిచ్చెక్కిపోవాల్సిందే..?

మెగాస్టార్ చిరంజీవి..అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సార్..సినిమాలంటే ముందుంటారు. తన ఆరోగ్యానికి కూడా లెక్కచేయకుండా మొత్తం ఇంట్రెస్ట్ సినిమాల పైనే చూయిస్తుంటారు. అందుకే కాబోలు ఈయన మెగాస్టార్ అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి యమ జోరు మీద వచ్చిన ప్రతి సినిమాను కమిట్ అవుతూ.. ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ లు కంప్లీట్ చేస్తూ వీలైనంత త్వరగా సినిమాలను అభిమానుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ విషయం లో యంగ్ హీరోలతో పోలిస్తే..మెగాస్టార్ చాలా ముందున్నాడు.

ఇక కొడుకు చరణ్ తో కలిసి..డైనమిక్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా మరి కొద్ది రోజుల్లో అభిమానుల ముందుకు రానుంది. సినిమాకి మెయిన హైలెట్ లైన్..తండ్రి కొడుకుల కలయిక. ఒక్క మెగా హీరో సినిమా రిలీజ్ అయితేనే బాక్స్ ఆఫిస్ వద్ద అదో పండగలా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇద్దరు మెగా హీరో..అది ఒకరు మెగాస్టార్, మరోకటి మెగా పవర్ స్టార్…పైగా తండ్రి కొడుకులు..ఇక ఊహించుకోండి సినిమా ధియేటర్స్ దగ్గర పరిస్ధితి ఎలా ఉంటూందో..అభిమానులు ఆనందానికి అడ్డు ఉండదు .

అయితే మెగా ఫ్యాన్స్ కి మరో కేకపెట్టించే న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అయిన చిరు.. మరో మలయాళం సూపర్ హిట్ సినిమా పై కన్నేసిన్నట్లు తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్టైన బ్రోడాడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమా మలయాళ వర్షెన్ లో మోహన్‌‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించగా..తెలుగులో ఆ రోల్స్ ను చిరంజీవి, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నతీంచబోతున్నట్లు తెలుస్తుంది. అంతే ఈ సినిమాలో చిరు తండ్రి , సాయి కొడుకు గా కనిపించబోతున్నారనమాట. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజంగా ఈ కాంబో సెట్ అయితే బాక్స్ ఆఫిస్ వద్ద ఓ సునామీ పక్కా అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే ఈ సినిమా బాధ్యతను చిరు డైరెక్టర్ హరీష్‌‌ శంకర్‌కి అప్పగించినట్లు ఇండస్ట్రీ టాక్. స్క్రిప్ట్‌‌లో చేయాల్సిన మార్పుల గురించి చర్చలు కూడా పూర్తయ్యయట. ఆచార్య రిలీజ్ తరువాత ఈ సినిమా పై అఫిషియల్ ప్రకటన వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది.