RRR ప్రమోషన్స్ కి విజయేంద్ర ప్రసాద్‌ ని దూరంగా ఉండమని చెప్పిన రాజమౌళి..ఎందుకంటే..?

RRR.. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది . కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన తరుణం మరి కొన్ని గంటల్లోనే ..రాబోతుంది. దీంతో మూవీ లవర్స్ చాలా ఈగర్ గా ఈ సినిమా చూడాలి వెయిట్ చేస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ఇక పవర్ ఫుల్ హీరోస్ తారక్-చరణ్ ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో ఆ అంచనాలు డబుల్ అయ్యాయి.

అటు మెగా అభిమానులు..ఇటు నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా..వాళ్ళ ఫేవరేట్ హీరోలని తెర పై చూసేద్దామా అని వెయిటింగ్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని అయితే రాజమౌళి..ఓ రేంజ్ లో చేస్తున్నారు, సినిమాని ప్రమోట్ చేసే ఏ ఛాన్స్ ని మిస్ చేసుకోవడం లేదు. దేశం మొత్త తిరిగేస్తూ.. తనదైన స్టైల్ లో RRR మూవీ కి ప్రమోషన్స్ నిర్వహిస్తూ..సినిమాకి మచి హైప్ తీసుకొచ్చారు.

కాగా, సినిమా ప్రమోషన్స్ కి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దూరంగా ఉంటున్నారు. మనకు తెలిసిందే రాజమౌళి తెరకెక్కించే అన్ని సినిమాలకి కధలు రాసేది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ నే అని. ఇక బాహుబలి సినిమాకి ఆయన చేసిన ప్రమోషన్స్..ఆ కార్యక్రమాలల్లో హాడావుడి మనం మర్చిపోగలమా..ఫంక్షన్ లో ఆయన ఉంటే అదో తెలియని కిక్..గౌరవం. కానీ RRRమూవీ ప్రమోషన్స్ లో ఆయన కనపడటం లేదు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఆయన కావాలనే సినిమాకి దూరంగా ఉన్నారట. ఎందుకంటే మొన్న ఆ మధ్య ఓ సారి విజయేంద్ర ప్రసాద్‌ కు కోవిడ్ సోకిందని..దీంతో ఆయన బాగా డల్ అయిపోయారని..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని..ఈ టైంలో ఆయన ను అటు ఇటు తిప్పడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని..రాజమౌళి RRR ప్రమోషన్స్ కి దూరం పెట్టారట. రాజమౌళి ఏం చేసినా దానికి ఓ అర్ధం ఉంటుందని అని మరోసారి ప్రూవ్ చేశాడు.