RRR “మల్లి” బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

టాలీవుడ్ టాప్ హీరోలు చరణ్-తారక్ కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన చిత్రం “రణం రౌద్రం రుధిరం”. ఇలాంటి ఇద్దరు బడా హీరోలతో కలిసి సినిమా తెరకెక్కించాలి అనే ఆలోచన వచ్చిన్నప్పుడే ..రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక శభాష్ రాజమౌళి అని విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమా శుక్ర వారం ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కని విని ఎరుగని కలెక్షన్స్ సాధిస్తుంది.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ అలియా భట్ కన్నా కూడా హైలెట్ అయిన పాత్ర.. సినిమా కి ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయిన “మల్లి” క్యారెక్టర్ లో నటించి..తారక్ తో..‘నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాంది’ అంటూ అమ్మె చెప్పే డైలాగ్‌ ధియేటర్స్ కి వచ్చిన జనాల చేత కన్నీరు తెప్పిస్తుంది. ఆ పాత్ర కు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇంతకి ఈ పాప ఎవరో తెలుసా..? పాప బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

RRR సినిమాలో మల్లి పాత్రల్లో మెప్పించిన ఈ చిన్నారి పేరు ట్వింకిల్‌ శర్మ. ఈమె నెటివ్ ప్లేస్ ఛండీగర్‌. అక్కడే ఉంటూ చదువుకుంటుంది. ట్వింకిల్‌ శర్మ.. డాన్స్‌ ఇండియా డాన్స్‌ అనే రియాలిటీ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆ గుర్తింపు తో ఈ పాప చాలా టీవీ యాడ్స్‌లో కూడా నటించి..మెప్పించింది. ముఖ్యంగా ఈ కామార్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ యాడ్‌లో పాప బాగా హైలెట్ అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈమెను ఆ యాడ్ లో చూసి ఆడిషన్‌కు పిలిపించి..స్క్రీన్ టెస్ట్ చేసి..పర్ ఫామెన్స్ బాగుండటంతో.. మల్లి పాత్రకు సెలక్ట్‌ చేశారట. షూటింగ్ టైంలో తారక్-చరణ్ కూడా మల్లి నటన కు ఫిదా అయ్యారని..మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకొచ్చారట. ఇక ఈ చిత్రం ద్వార సక్సెస్ అందుకున్న ఈ పాప మరిన్ని మూవీస్ లో అవకాశాలు అందుకునే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.