మల్లెమాల షాకింగ్ డెసీషన్..భారీ బొక్క తప్పదా..?

మల్లెమాల సంస్థ..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మంచి షోలను తీస్తూ..బాగా పాపులరిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా మల్లెమాల అనగానే మనకు బాగా గుర్తు వచ్చేది జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఎన్నో షో లో జబర్దస్త్ షో కి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఈ షో వస్తుందంటే..పెద్ద వాళ్లు సైతం టీవీకి అత్తుకుని కూర్చునే వారు. ఆ స్కిట్ చూసి ఆ స్కిట్ లల్లో కామెడీ పంచ్ డైలాగులు విని పడి పడి నవ్వుకునేవారు. మారుతున్న కాలని..జబర్దస్త్ లో కూడా టీం లీడర్స్ మారడం.. పెద్దగా వాళ్ళ కామెడీ ఆకటుకోకపోవడంతో..షో దొబ్బేసిందనే కాని..లేకపోతే ఈ షో ఓ రేంజ్ లో దూసుకుపోయేది.

కాగా ఈ షో జడ్జీలుగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి టీం లీడర్స్ ..వాళ్ల కంటెస్టెంట్స్ అందరికి మల్లెమాల సంస్థ ఊహించని షాక్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. రోజు రోజుకు ఈ షో టిఆర్పి రేటింగ్ విపరీతంగా పడిపోతుందని..చూసే ప్రజలకన్నా..యూట్యూబ్ లో తిట్టే జనాభానే ఎక్కువైపోతున్నారని..అంటూ..”ఇక పై మీకు మీ స్కిట్లకి పేమంట్ కరెక్ట్ గా అందాలి అన్నా..లేక మీకు మనీ ఎక్కువ రావాలి అన్నా కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటేనే” అంటూ…ఓ బిగ్ బాంబ్ పేల్చారట.

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ కాస్త తగ్గిందనే వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. నెట్టింట ట్రోలింగ్ కూడా బాగా ఎక్కువైయాయి. రేటింగ్ పెరిగితేనే జబర్దస్త్ కమెడియన్ ల రెమ్యూనరేషన్ పెరుగుతాయి అన్నట్లుగా మల్లెమాల సంస్థ చెప్పినట్లుగా టాక్ బాగా వినిపిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఇస్తున్న పారితోషంలోను భారీగా కోట విధించారని తెలుస్తుంది. దీంతో కొందరు కంటెస్టెంట్స్ వేరే ఆఫర్లు రావడంతో పక్క చానెల్స్ కి జంప్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్ , రష్మి లాంటి పాపులర్ ఆన్ స్క్రీన్ జంట కూడా ఈ మధ్యనే మరో స్టార్ ఛానెల్ లో ప్రోగ్రామ్ లు ఇస్తున్నారు. ఇంకా చాలా మంది ఇలానే జంప్ అవుతున్నారు అంటూ సమాచారం ఒక్కవేళ అదే జరిగితే జబర్ధస్త్ షో కి భారీ బొక్క తప్పదు అంటున్నారు టెలివిజన్ ఎక్స్పర్ట్స్.