మెగా డాటర్ మైండ్ దోబ్బిందా..ఏంటి ఈ పోస్ట్లు..?

హా..ప్రస్తుతం నెటిజన్స్ ఇలానే కామెంట్స్ చేస్తున్నారు మెగాడాటర్ శ్రీజ పెట్టిన పోస్ట్ పై. గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో తన మొదటి పెళ్లి విషయంలో మీడియాలో హెడ్ లైన్స్ లో నిలిచిన చిరంజీవి ముద్దుల కూతురు..ఆ తరువాత అతను వద్దని..ఇంట్లో ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నా..మళ్లి ఇంటికే తిరిగి వచ్చేసింది. వస్తూ వస్తూ తన మొదట భర్త తో కన్నా పాపని కూడా తెచ్చేసుకుంది.

కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న శ్రీజకు ..ఆ తరువాత చిరంజీవి ఓ పెద్దింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశాడు. సరే అంతా అయిపోయింది గతం గతాః అన్నట్లు మర్చిపోయి.. వచ్చిన కొత్త అల్లుడితో సరదాగా గడిపారు. పార్టీలు చేసుకున్నారు..అంతేనా..ఆయనని సినిమాలోకి హీరోగా తీసుకొచ్చి,,మెగా హీరో ట్యాగ్ అందించారు. కానీ అభిమానులు శ్రీజ భర్తను ఆదరించలేదు..నటన నచ్చలేదో..లేక మెగా అల్లుడు గా సెట్ అవ్వలేదో తెలియదు కానీ మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ ని దూరం పెట్టారు. దీంతో సినిమాల్లో టాప్ పోజీషన్ కి వెళ్లాలి అనే ఆశ కళ గానే ఉండిపోయింది.

సీన్ కట్ చేస్తే.. సడెన్ గా మెగా డాటర్ సెకండ్ డైవర్స్ ఇష్యూ తెర పై హాట్ టాపిక్ గా నడించింది. దీని పై కుటుంబ సభ్యులు కూడా ఏం స్పందించకపోవడంతో..మౌనం అర్ధ అంగీకారం అన్నట్లు మనల్నే అర్ధం చేసుకోమన్నట్లు ఉన్నారు మెగా కుటుంబం. ఇక శ్రీజ కూడా సింగిల్ స్టేటస్ లు పెడుతూ..భర్త ని అవాయిడ్ చేస్తూ..పిల్లలతో ఉండే పిక్స్ నే మీడియాతో షేర్ చేసుకుంటుంది. కాగా రీసెంట్ గా శ్రీజ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అర్ధమై కానట్లు ఉండే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. తాజాగా శ్రీజ ఏం రాసుకొచ్చిందంటే..”నేర్చుకోకుండా ఉండటం, తిరిగి నేర్చుకోవడం వంటివి నేర్చుకుంటున్నాను”(Learning to Unlearn and Relearn) .. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు నెటిజన్స్ మైండ్ దొబ్బిందా..ఏం మాట్లాడుతున్నావో నీకైన అర్ధం అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీజ చెప్పాలి అనుకున్న విషయం ఏంటో ఎవ్వరికి సరిగ్గా అర్థం కాలేదు. దీంతో నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతుంది మెగా డాటర్.