యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా రిజల్ట్ను పక్కనబెట్టిన ప్రభాస్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.
ఈ క్రమంలోనే ప్రభాస్ వెంటనే ఓ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. దీనిలో భాగంగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించాలని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించి, అంతే త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ అనుష్క శెట్టి మరోసారి హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రభాస్తో అనేక సినిమాల్లో నటించిన అనుష్క, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా మారింది. ఈ క్రమంలోనే అనుష్కను ప్రభాస్ పక్కన చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో మారుతి మరోసారి ఈ కాంబోను మనమందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను అనుష్కకు చెప్పాడట ఈ డైరెక్టర్. అయితే తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా అనుష్క చెప్పకపోవడం గమనార్హం. మరి ప్రభాస్ కోసం మారుతి ఎలాంటి సబ్జెక్ట్ను పట్టుకొస్తున్నాడో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.