ఆహా 2.0 లో నందమూరి బాలకృష్ణగా చేస్తోన్న అన్ స్టాపబుల్ కనివినీ ఎరుగని రీతిలో సూపర్ హిట్ అయ్యింది. అసలు బాలయ్య టాక్ షో అనగానే ముందు ఎలాంటి అంచనాలు లేవు. సీనియర్ హీరోగా ఉన్న బాలయ్యకు ఈ టాక్ షోలు సూట్ అవుతాయా ? అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ అన్స్టాపబుల్ బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఫస్ట్ సీజన్లో బాలయ్య మోహన్బాబు, నేచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్, మాస్ మహరాజ్ రవితేజ, మహేష్బాబు, అఖండ, పుష్ప టీంలు ఇలా చేసిన ప్రతి ఎపిసోడ్ బాగా పేలింది.
బాలయ్య పదునైన పంచ్లతో పాటు తాను అడగాల్సిన విషయాలు కూడా ఎవ్వరిని నొప్పించకుండా ఆన్సర్లు రాబట్టిన తీరు అద్భుతం. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్కువ వ్యూస్ రాబట్టిన టాక్ షోగా రికార్డులకు ఎక్కిన అన్స్టాపబుల్ 40 కోట్ల నిమిషాల క్లిక్స్ పడిన షోగా సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. టాలీవుడ్ హీరోలందరిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిన ఈ టాక్ షో తెలుగులోగిళ్లలోకి మరింత చేరువ అయ్యింది.
ఇక ఆహా అన్స్లాపబుల్ 2 ను కూడా ప్లాన్ చేస్తోంది. జూలై నుంచి ఈ సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పకనే చెప్పింది. అన్స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ సీజన్కు బాలయ్య భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్కు ఎవరు హోస్ట్ పీఠం ఎక్కుతారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఆహాకు అప్పుడే ఆన్సర్ దొరికేసినట్టు తెలుస్తోంది.
గతంలో ఆహాలో సమంత, మంచు లక్ష్మి టాక్ షోలు చేశారు. తర్వాత వారు కంటిన్యూ కాలేదు. ఇప్పుడు బాలయ్యను ఆహా కంటిన్యూ చేస్తుందా ? అన్న డౌట్లు ఉన్నాయి. మరోవైపు బాలయ్య వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. అయితే ఆహా మాత్రం బాలయ్యతోనే సెకండ్ సీజన్ కూడా కంటిన్యూ చేయాలని డిసైడ్ అయిపోయినట్టు ఆహా టీం నుంచి మ్యాటర్ బయటకు వచ్చేసింది. ఈ సెకండ్ సీజన్లో చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ను తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.