ఆ సమయంలో జరిగిన అసలు విషయం చెప్పిన సమంత?

ఏం మాయ చేసావే.. నాగచైతన్య సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని ఇప్పుడే కాదు ఎప్పటికీ మరచిపోలేరు. అంతలా యూత్ ను ఆకర్షించింది ఈ సినిమా. ఇక టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలకు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. అంతేకాదు హీరోహీరోయిన్లుగా నాగచైతన్య సమంత లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మొదటి ఇక సినిమా లోనే ఏకంగా సమంత లిప్ లాక్ లతో తెలుగు ప్రేక్షకులు అందర్నీ కూడా ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి.  ఇక ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయింది సమంత.

అంతేకాదు సమంతకి ఏం మాయ చేసావే సినిమా నాగచైతన్య లాంటి లైఫ్ పార్టనర్ ని కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు విడాకులతో విడిపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ఏం మాయ చేసావే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 12 ఏళ్లు పూర్తయింది. ఇక ఇటీవల ఈ సినిమా సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుంది హీరోయిన్. ఏం మాయ చేసావే సినిమా సమయంలో మాత్రమే తాను మొదటిసారి ఆడిషన్స్ కు వెళ్లాను అంటూ చెప్పింది. ఆ తర్వాత ఏ సినిమాకి కూడా ఆడిషన్స్  ఇవ్వలేదని చెప్పిన సమంత ఇప్పుడు ది అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ కోసం  మరోసారి ఆడిషన్స్ ఇవ్వాల్సి  వచ్చింది అంటూ గుర్తుచేసుకుంది.

ఏం మాయ చేసావే సమయంలో  ఆడిషన్ కి ఎంత భయపడ్డానో.. ఇప్పుడూ కూడా అదే భయం ఉంది అంటూ సమంతా మనసులో మాట బయట పెట్టేసింది. కాగా విడాకుల తర్వాత టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడా లేకుండా సమంతా సూపర్ స్పీడ్ తో దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడాఛాన్స్ కొట్టేసింది సమంత.