ఉదయ్ కిరణ్ చెల్లి శిరీష ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి ఫేట్ ఎలా మారుతుందో అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. కొంతమంది మొదట్లో సినిమా అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత మాత్రం అద్భుతంగా రాణించడం చేస్తూ ఉంటారు.. కానీ కొంతమంది మొదట్లో వరుస అవకాశాలతో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్న ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.. ఇక అలాంటి హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.

కొన్ని సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు.. ఇక ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడంతో దర్శక నిర్మాతలు ఈ హీరో డేట్స్ కోసం క్యూ కట్టేవారు అని చెప్పాలి. ఇలా కొన్నాళ్ళు పాటు కెరీర్ సక్సెస్ఫుల్గా కొనసాగగా ఆ తర్వాత మాత్రం ఉదయ్ కిరణ్ కు గడ్డుకాలం ఏర్పడింది. ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన విజయాలు మాత్రం సాధించలేదు. సొంత నిర్మాణంలో సినిమాలు తీసినా నష్టాలే మిగిలాయి. సినిమానే నమ్ముకున్న ఉదయ్ కిరణ్ మనసు బాధ పడి చివరికి ఆత్మహత్య చేసుకొని అందరికీ దూరం అయిపోయాడు.. అయితే ఉదయ్కిరణ్ దూరమైనప్పటికీ ఇప్పటికి ఆయన ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అనే చెప్పాలి.

ఇకపోతే ఉదయ్ కిరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదంటే మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్ కి ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా. కేవలం ఉదయ్ కిరణ్ కి మాత్రమే కాదు హీరో చెల్లెలు గా నటించిన శిరీష కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అంతలా చెల్లెలి పాత్రలో ఒదిగిపోయింది శిరీష. మనసంతా నువ్వే సినిమా తర్వాత వర్షం, నేనొక్కడినే, పల్లకిలో పెళ్లికూతురు సినిమా లో కొన్ని పాత్రల్లో నటించి అలరించింది. ఇటీవలె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది శిరీష. మౌనరాగం సీరియల్ లో నీలవేణి పాత్రలో నటిస్తూ అటు బుల్లితెరపై కూడా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శిరీష.