పాపం..ఆ భయంతో ఇంటికి వెళ్లడమే మానేశారట.. ఎన్టీఆర్ ఎంత బాధపడ్డారో తెలుసా..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పేరుకు ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక్ ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకి తనలో కొత్త టాలెంట్ ను బయట పెడుతూ.. చూసే కొద్ది మళ్లీ మళ్ళీ చూడాలి అనిపించేలా డైలాగ్స్ చెప్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న విడుదల చేయడానికి మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ సినిమా కోసం తారక్, చరణ్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు శ్రమించారు. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఓ విషయంలో భయపడ్డారట. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ టైంలోనే కరోనా రెండు వేవ్ లు బాగా విజృంభించాయి. ఎంతో మంది కళ్ల ఎదుటే చనిపోతున్నా ఏం చేయలేక దిక్కుతోచని స్ధితిలో ఉండిపోయాం. ఇక అలాంటి రోజుల్లో కూడా తారక్ షూటింగ్ కు కరెక్ట్ టైం కు అటెండ్ అయ్యేవాడట. కానీ, ఇంటిని నుండి కాదట. మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఇంట్లో ఇద్దరు పిల్లలు, వాళ్ల అమ్మగారు ,ప్రణతి ఉంటారు.

ఇక బయట పెరిగిపోతున్న కరోనా కేసులను చూసి ఎన్టీఆర్ హైదరబాద్ లోనే ఉన్నా కూడా ..ఇంటికి వెళ్ళకుండా..ఓ హోటల్లో ఉంటూ..అక్కడి నుంచే సినిమా షూటింగ్ లకు అటెండ్ అయ్యేవాడట. తను బయట తిరగడం ద్వార ఒకవేళ కరోనా వస్తే అది కాస్త వాళ్ల ఇంట్లో వాళ్లకు అటాక్ అయితే కష్టం అని భావించిన ఎన్టీఆర్..ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇలా చేసారట. ఇక టైంలో ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట. పిల్లలతో కూదా వీడియో కాల్ లోనే మాట్లాడి..వాళ్ళను చూసి ఎమోషనల్ అయ్యేవాడట. అయితే ఎట్ట‌కేల‌కు ఫ్యామిలీని క‌లిశాక‌.. ఆయ‌న మ‌ళ్లీ మామూలు మ‌నిషి అయ్యార‌ట‌. ప్రస్తుతం తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.