ఆ విషయంలో చిరుతో పోటీపడ్డ శ్రీదేవి.. విమర్శించిన నిర్మాతలు..!!

చిరంజీవి.. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. సినిమాలలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కేంద్రమంత్రిగా ఎదిగిన చిరంజీవి ఎన్నో విషయాలలో అటు సినీ కార్మికులకు ఇటు ప్రజలకు కూడా అండదండగా నిలుస్తున్నారు.. ఇకపోతే చిరంజీవితో పోటీ పడాలి అంటే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే.. సినీ చరిత్రలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినా కూడా కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తూ బిజీ స్టార్ గా మారిపోయారు.. ఇకపోతే అందాల తార శ్రీదేవి ఒక విషయంలో మాత్రం చిరంజీవి తో సమానంగా పోటీ పడాలని ప్రయత్నం చేసిందట. అదేంటో మనమిప్పుడు చదివి తెలుసుకుందాం..

ఉత్తర, దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో తన అందచందాలతో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి ఎన్నో సినిమాలలో నటించి మంచి ఆదరణ పొందింది.ఎంతో మంది స్టార్ హీరోలతో వారి తండ్రులతో కూడా నటించిన ఈ భామ, తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుని, ఏ జనరేషన్ వారికైనా సెట్ అవుతుంది అని అనిపించుకుంది.ఇక అసలు విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా కొండవీటి దొంగ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే . ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి అనుకున్నారంట.అయితే ఈ సినిమా కోసం మొదట ఆమెను సంప్రదించారు నిర్మాతలు. అయితే ఆ సమయంలో శ్రీదేవి ఒక విషయం చెప్పడంతో నిర్మాతలు షాక్ అయినట్లు తెలుస్తోంది. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోతో సమానంగా తన పాత్ర ఉండేటట్లు చూడాలని, అలా అయితేనే సినిమా చేస్తానని ఆమె కండిషన్ పెట్టిందట. ముఖ్యంగా ఈ విషయం బయటకి రావడంతో కొంత మంది నిర్మాతలు ..ఆమెకు ఎందుకు అంత అహంకారం..? అంటూ కోప్పడ్డం జరిగిందట.

అయితే తెలుగులో ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అందుకే కొంతమంది ఆమె స్థాయిని అర్థం చేసుకొని అవకాశాలు ఇవ్వడంతో, ఆ సినిమాలు కాస్త డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఆమెపై పలు రకాలుగా వార్తలు రావడంతో పాటు విమర్శల పాలు కూడా అయ్యింది శ్రీదేవి . నిజానికి ఈమె నాలుగు సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 14 వ ఏట హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో మంచి విజయాన్ని అందుకుంది శ్రీదేవి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలు కూడా పోషించింది ఈ ముద్దుగుమ్మ.