టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునారు. ప్రస్తుతం ఈ సినిమా పై మరో కొత్త వివాదం చుట్టుకుంది.ఈ సినిమా పై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన అల్లూరి సౌమ్య ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్ దాఖలు చేశారు.
అసలు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ పిటిషనర్ కోరారు దానితో పటు సినిమా రిలీజ్ కి కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు.అల్లూరి సౌమ్య దాఖలు చేసిన పిల్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది.పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జన్ భూయాన్ బెంచ్ తెలిపింది.