వార్నీ.. మహేష్ సినిమాకు రెండు రిలీజ్ డేట్లు?

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గీతగోవిందం ఫ్రేమ్ పరశురామ్ తో సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడటంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ కరోనా నుంచి బయటపడిన మహేష్ బాబు చిన్న శస్త్రచికిత్సతో చేసుకుని మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోపోతున్నాడు.

ఇక ఫిబ్రవరి మొదటి వారంలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కాబోతోంది. ఇక ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కాబోతుందన్నా విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరగా పూర్తిచేసి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడట మహేష్ బాబు. ఈ సినిమాపై భారీగా రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల గురించి ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

దసరా సందర్భంగా విడుదల కుదరకపోతే ఇక సంక్రాంతికి ఈ సినిమాను బరిలోకి దింపాలని అనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మొత్తంగా చూసుకుంటే అటు త్రిబుల్ ఆర్ లాగానే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు రెండు రిలీజ్ రేట్లు ఉన్నాయి అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. ఇకపోతే త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేయబోయే సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు మహేష్ మామగా నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది అన్న విషయం తెలిసిందే.