RRR వల్ల తీవ్ర నష్టాల్లో తారక్.. నష్టాన్ని ఇలా పూడ్చబోతున్నాడా ?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఆఖరు నిమిషంలో వాయిదా పడింది. దీంతో సినిమాల విడుదల ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. రాజమౌళి సినిమాతో పోటీ వద్దు అనుకున్న నిర్మాతలు ఈ సినిమా వాయిదాతో తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు. అయితే త్రిఫుల్ ఆర్ సినిమా వాయిదాతో ఎక్కువ నష్టపోయింది మాత్రం ఎన్టీఆర్ అంటున్నారు సినీ జనాలు. మూడేళ్లుగా ఈ సినిమా కోసం తను పనిచేశాడు. మిగతా ఏ సినిమాలు కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం ఈ సినిమా విడుదల ఆగిపోవడంతో.. వేరే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా లాస్ ని మిగతా సినిమాలతో సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలకు ఓకే చెప్తున్నాడు. 2022ని త్రిఫుల్ ఆర్ సినిమాతో గ్రాండ్ గా మొదలు పెట్టి మరో రేంజికి వెళ్లాలి అనుకున్నాడు. కానీ ఆ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా మూలంగా ఇప్పటికే మూడు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇంకా టైం వేస్టు చేసుకోవాలి అనుకోవడం లేదు. అందుకే ప్రస్తుతం రెండు సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి క్రేజీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. మరో సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ సినిమాతో సక్సెస్ అయిన కొరటా, ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ సినిమా సంక్రాంతికి మొదలు పెట్టి ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు.

ఓవైపు కొరటాలతో సినిమా చేస్తూనే మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. బుచ్చి బాబు చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చడంతో ఓకే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అటు ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ మూవీ బిజీలో ఉన్నాడు. బుచ్చిబాబుకే ఎన్టీఆర్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది.